వచ్చే ఏడాది జనవరి 26న ఢిల్లీలోని కర్తవ్యపథ్లో జరిగే గణతంత్ర దినోత్సవ వేడుకల కవాతులో అరుదైన యానిమల్ కంటింజెంట్ (జంతువుల బృందం) ప్రదర్శన ఇవ్వనుంది. రీమౌంట్ అండ్ వెటర్నరీ కార్ప్స్ విభాగానికి చెందిన శిక్షణ పొందిన జంతువులను ఈ కవాతులో ప్రదర్శించనున్నారు. సరిహద్దు భద్రత కోసం ఉపయోగించే బాక్ట్రియన్ ఒంటెలు, గుర్రాలు, డేగలు, ఆర్మీకి చెందిన జాగిలాలు ఈ బృందంలో భాగంగా ఉంటాయి. ప్రభుత్వ వర్గాలు ఈ విషయాన్ని వెల్లడించాయి.