AP: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తుడు తాళ్లపాక అన్నమాచార్యులు 600 ఏళ్ల క్రితం తిరుమలకు నడిచి వెళ్ళిన 95 కిలోమీటర్ల అన్నమయ్య కాలిబాటను అటవీశాఖ అధికారులు మూసివేశారు. కుక్కలదొడ్డి సమీపంలో ఏనుగుల సంచారం, భక్తులకు ప్రాణహాని నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ మూసివేతపై వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు. కొందరు కావాలనే రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు.