TG: రాష్ట్రంలోని మహిళా సంఘాలకు మరో 448 అద్దె బస్సులు కేటాయించినట్లు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. రాష్ట్రంలో మహిళాశక్తి పథకం కింద స్వయం సహాయక సంఘాల ద్వారా బస్సులను కొనుగోలు చేయించి, వాటిని ఆర్టీసీకి అద్దెకు ఇప్పించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇప్పటికే మొదటి విడతలో ఉమ్మడి WGL, కరీంనగర్, MBNR, KMM జిల్లాల్లోని 150 మహిళా సంఘాలకు 150 బస్సులను కొనుగోలు చేసింది.