కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం గద్దపాక గ్రామంలో ప్రభుత్వం వడ్లు కొనకపోవడంతో, మంగళవారం సాయంత్రం వడ్లను కుప్పలుగా పోస్తున్న సమయంలో గుండెపోటుతో రైతు ఐలయ్య మృతి చెందారు. వర్షం పడే అవకాశం ఉందని భావించి పంటను కుప్పపోస్తుండగా ఆయన కుప్పకూలిపోయారు. ప్రభుత్వం సకాలంలో పంటను కొనుగోలు చేసి ఉంటే ఐలయ్య బ్రతికేవాడని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేశారు.