రాజస్థాన్‌లో మరో ‘హనీమూన్‌ హత్య’.. పెళ్లైన 3 నెలలకే భర్తను చంపేసిన భార్య

74చూసినవారు
రాజస్థాన్‌లో మరో ‘హనీమూన్‌ హత్య’.. పెళ్లైన 3 నెలలకే భర్తను చంపేసిన భార్య
రాజస్థాన్‌లో మరో ‘హనీమూన్ హత్య’ కేసు కలకలం రేపింది. పెళ్లై 3 నెలలు గడవకముందే భర్త ఆశిష్‌ను భార్య అంజు తన ప్రియుడు సంజూతో కలిసి హత్య చేయించినట్లు పోలీసులు గుర్తించారు. రాత్రి సమయంలో దంపతులు రోడ్డుపై నడుస్తుండగా సంజూ కారుతో ఆశిష్‌ను ఢీకొట్టి పరారయ్యాడు. మొదట ప్రమాదంగా చిత్రీకరించేందుకు అంజు ఇచ్చిన వాగ్మూలంలో అనేక అనుమానాలు తలెత్తడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. విచారణలో అంజుకు ఇంటి సమీపంలో నివసించే సంజూతో వివాహేతర సంబంధం ఉన్నట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను విచారిస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్