మరో ఘటన.. పీజీ విద్యార్థినిపై సమూహిక అత్యాచారం

40చూసినవారు
మరో ఘటన.. పీజీ విద్యార్థినిపై సమూహిక అత్యాచారం
తమిళనాడులోని కోయంబత్తూర్ ఎయిర్ పోర్టు సమీపంలో ఓ పీజీ విద్యార్థిని సమూహిక అత్యాచారం జరిగింది. ఆదివారం సాయంత్రం ఆమె ప్రియుడితో కలిసి బయటకు వెళ్లింది. రాత్రి 11గ.లకు ఎయిర్‌పోర్టు దగ్గర వారు కారులో ఉండగా అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తులు అద్దాలు పగులగొట్టి ప్రియుడిని తీవ్రంగా కొట్టారు. ఆమెను దూరంగా షెడ్‌లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. పోలీసులు బాధితులను ఆసుపత్రికి తరలించి నిందితుల కోసం గాలిస్తున్నారు.