AP: తిరుమల లడ్డూ కోసం వినియోగించిన నెయ్యిలో జంతు కొవ్వు కలిపారన్న ఆరోపణలపై సీబీఐ దర్యాప్తులో కీలక నిజాలు వెలుగులోకి వచ్చాయి. గుజరాత్లోని నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు (NDDB) ద్వారా మరోసారి నెయ్యి శాంపిల్స్ను పరీక్షించిన సీబీఐ, అందులో ఎలాంటి జంతు కొవ్వు కలపలేదని స్పష్టంగా నిర్ధారించింది. దీంతో లడ్డూ నెయ్యి కల్తీపై వచ్చిన ఆరోపణలకు ఆధారాలు లేవని సీబీఐ తేల్చినట్లు సమాచారం.