ప్రకాశం జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. కొత్తపట్నం మండలం గుండమాల తీరంలో వినాయక నిమజ్జనానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులను మోటుమాల గ్రామానికి చెందిన నాగరాజు, పాలచందర్లుగా పోలీసులు గుర్తించారు. వారిని పోస్ట్మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.