ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబరిచిన బాలలకు కేంద్ర ప్రభుత్వం 'ప్రధానమంత్రి రాష్ట్రీయ బాల పురస్కార్'లను ప్రకటించనుంది. సాహసం, క్రీడలు, సామాజిక సేవ, శాస్త్ర, సాంకేతికత, పర్యావరణ, కళలు, సాంస్కృతిక రంగాల్లో విశేష ప్రతిభ కనబరిచిన బాలలకు ఈ పురస్కారాలు అందజేస్తారు. ఐదేళ్లు పైబడి, జులై 31 నాటికి 18 ఏళ్లు నిండని బాలలు జాతీయ అవార్డ్స్ పోర్టల్ ద్వారా ఆన్లైన్లో నామినేషన్లు పంపవచ్చు. బాలలు స్వయంగా లేదా ఇతరుల ద్వారా నామినేషన్లు పంపేందుకు జులై 31 వరకు గడువు ఉంది.