మెసేజింగ్ దిగ్గజం వాట్సాప్కు ప్రత్యామ్నాయంగా జోహో సంస్థ రూపొందించిన స్వదేశీ యాప్ 'అరట్టై' వేగంగా పాపులర్ అవుతోంది. కేంద్ర మంత్రులు, సెలబ్రిటీలు, సీఈవోలు ప్రచారం చేయడంతో ఈ యాప్ డౌన్లోడ్లు పెరిగాయి. అక్టోబర్ 3 నాటికి 75 లక్షల మంది అరట్టై యాప్ను డౌన్లోడ్ చేసుకున్నారు. గూగుల్ ప్లేస్టోర్, యాపిల్ యాప్స్టోర్లలో ఇది మంచి ఆదరణ పొందుతోంది.