ఆసియా కప్ 2025 టోర్నీ సెప్టెంబర్ 9న ప్రారంభం కానుంది. ఈ టోర్నీ బ్రాడ్కాస్టింగ్ రైట్స్ సోనీ నెట్వర్క్ దక్కించుకుంది. సోనీ టీవీ ఛానెల్స్తో పాటు ఆ సంస్థకు చెందిన ఓటీటీ ఫ్లాట్ఫామ్ సోనీ లైవ్లోనూ ఈ మ్యాచ్లు ప్రత్యక్ష ప్రసారం కానున్నాయి. అయితే నేరుగా ఈ ఛానెల్స్, ఓటీటీ ఫ్లాట్ఫామ్స్లో చూడాలనుకుంటే సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే జియో యూజర్స్, ఎయిర్టెల్ యూజర్స్.. జియో టీవీ, ఎయిర్టెల్ టీవీల సాయంతో ఈ మ్యాచ్లను ఉచితంగా చూడవచ్చు.