హర్యానాలోని మహర్షి దయానంద్ యూనివర్సిటీ (MDU)లో దారుణ ఘటన చోటుచేసుకుంది. నలుగురు మహిళా పారిశుధ్య కార్మికుల పట్ల వారి సూపర్వైజర్లు అమానవీయంగా ప్రవర్తించారు. రుతుక్రమంలో ఉన్నామని, అందుకే విధులకు ఆలస్యమయ్యామని ఆ మహిళలు చెప్పడంతో.. ఒకరిని బట్టలు తీసివేయమని, మరొకరి శానిటరీ ప్యాడ్లను తనిఖీ చేయమని ఆదేశించారు. ఈ ఘటన కలకలం రేపడంతో అధికారులు సూపర్వైజర్లను సస్పెండ్ చేసి పోలీసులకు అప్పగించారు.