ఇరాన్లోని ఉర్మియా నగరంపై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడులు కలకలం రేపాయి. భారతీయ విద్యార్థులు నివసిస్తున్న హాస్టల్కు కేవలం 300 మీటర్ల దూరంలోనే బాంబులు పడటంతో భవనాలన్నీ కంపించాయి. ఉర్మియా యూనివర్సిటీలో చదువుకుంటున్న కాశ్మీరీ విద్యార్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రతి గంటకు ఫైటర్ జెట్లు గాల్లో చక్కర్లు కొడుతున్నాయని, స్థానికులు నగరాన్ని వదిలి వెళ్తున్నారని సమాచారం. ఈ దాడితో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ కమ్ముకుంది.