పశ్చిమాసియాలో దాడులు మరింత తీవ్రతరం అవుతున్నాయి. గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతీకార దాడులు కొనసాగిస్తోంది. తాజాగా సౌదీ అరేబియా, బహ్రెయిన్లోని
అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణులతో విరుచుకుపడింది.
ప్రిన్స్ సుల్తాన్ ఎయిర్ బేస్పై జరిగిన దాడిలో అనేక మంది
అమెరికా సైనికులు గాయపడ్డారు. యుద్ధ విమానాలు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున ఇజ్రాయెల్లోని అనేక ప్రాంతాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.