ఉత్తరప్రదేశ్లోని మధురలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లను ఒక ఆటో డ్రైవర్, అతని స్నేహితులు, గెస్ట్హౌస్ ఉద్యోగితో కలిసి అపహరించి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. సాక్ష్యాలను నాశనం చేసేందుకు నిందితులు బాలికలను మధుర జంక్షన్కు తీసుకెళ్లి, ఢిల్లీ వెళ్లే రైలు ఎక్కించారు. అయితే, బాలికలు ధైర్యంగా ఇంటికి చేరుకుని తల్లిదండ్రులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు.