అండర్-35 ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను అధికంగా కలిగిన నగరాల్లో బెంగళూరు అగ్రస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ముంబయి, దిల్లీ ఉన్నాయి. హైదరాబాద్ అయిదో స్థానంలో ఉంది. రాష్ట్రాల వారీగా చూస్తే కర్ణాటక, మహారాష్ట్ర, దిల్లీ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఈ జాబితాలోని మహిళల్లో ఈశా అంబానీ, మిను మార్గరెట్, రితిక మోహన్, కావ్య కళానిధి మారన్, సుకృతి సచ్దేవ, అద్వైత నాయర్ తదితరులున్నారు.