స్పేస్ఎక్స్ అంతరిక్ష ప్రయోగం వాయిదా పడింది. 'Axiom-4' మిషన్ ద్వారా భారత ఆస్ట్రోనాట్ శుభాంశు శుక్లాతో పాటు మరో ముగ్గురు వ్యోమగాములు రోదసిలోకి వెళ్లాల్సి ఉంది. అయితే వారిని రోదసీలోకి తీసుకువెళ్లే ఫాల్కన్ 9 రాకెట్లో ద్రవ ఆక్సిజన్ లీక్ సమస్య కారణంగా ఆక్సియం-4 మిషన్ ప్రయోగాన్ని స్పేస్ఎక్స్ విరమించుకుంది. కొత్త ప్రయోగ తేదీని త్వరలో ప్రకటిస్తామని తెలిపింది.