దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తి అజారుద్దీన్: కిషన్ రెడ్డి

39చూసినవారు
దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తి అజారుద్దీన్: కిషన్ రెడ్డి
TG: అజారుద్దీన్‌కు మంత్రి పదవిపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘దేశ ద్రోహానికి పాల్పడిన వ్యక్తి అజహరుద్దీన్. దేశానికి చెడ్డ పేరు తెచ్చారు. అలాంటి వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారు?’ అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో ఎంఐఎం ఎందుకు పోటీ చేయడం లేదని అడిగారు. కాంగ్రెస్ పార్టీ ముసుగులో మజ్లిస్ పార్టీ అభ్యర్థే జూబ్లీహిల్స్‌లో పోటీ చేస్తున్నారని ఆరోపించారు.