నేడు ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం

17చూసినవారు
నేడు ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్, కోదండరాం ప్రమాణస్వీకారం
TG: గవర్నర్ కోటాలో ప్రొఫెసర్ కోదండరాం, మంత్రి అజరుద్దీన్‌లను ఎమ్మెల్సీలుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా ఆదేశాల మేరకు సాధారణ పరిపాలన శాఖ గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో వీరిద్దరూ ఇవాళ ఉదయం 11 గంటలకు ఎమ్మెల్సీలుగా ప్రమాణం చేయనున్నారు. శాసనమండలి ఛైర్మన్ కార్యాలయం ప్రమాణ స్వీకారానికి ఏర్పాట్లు చేస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్