TG: హనుమకొండ జిల్లాలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న జె.కీర్తన (19) అనే విద్యార్థిని ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. అధ్యాపకులు చెప్పిన పాఠాలు అర్థం కావడం లేదని, తల్లిదండ్రులకు దూరంగా ఉండలేకపోతున్నానని ఆమె తరచూ ఫోన్లో బాధపడేదని కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆమెను ఇంటికి రప్పించి, వేరే కళాశాలలో చేర్పించేందుకు ప్రయత్నిస్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది.