నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో రూపొందుతున్న చారిత్రాత్మక చిత్రం బుధవారం రామానాయుడు స్టూడియోస్లో ఘనంగా ప్రారంభమైంది. బాలకృష్ణ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్తో ముహూర్తపు షాట్ చిత్రీకరించారు. దర్శకుడు బి.గోపాల్ క్లాప్ కొట్టగా, బాలకృష్ణ కుమార్తె తేజస్విని కెమెరా స్విచ్ ఆన్ చేశారు. ఏపీ మంత్రులు అనగాని సత్యప్రసాద్, గొట్టిపాటి రవికుమార్ స్క్రిప్ట్ను అందజేశారు.