బెంగళూరులో డాక్టర్ కృతికా రెడ్డి హత్యకేసులో సంచలన విషయాలు బయటపడ్డాయి. ఏప్రిల్ 24న మత్తుమందు అధిక మోతాదుతో హత్య చేసిన భర్త డాక్టర్ మహేంద్రారెడ్డి, ఆమె అనారోగ్యంతో చనిపోయిందని చెప్పాడు. ఆరు నెలల విచారణ తర్వాత నిజం బయటపడడంతో అక్టోబర్ 14న అతన్ని అరెస్ట్ చేశారు. భార్యను చంపిన వెంటనే ప్రియురాలికి "నీకోసం నా భార్యను చంపేశా" అంటూ డిజిటల్ పేమెంట్ యాప్లో మెసేజ్ చేశాడు. పోలీసులు ప్రియురాలి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు. ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు తెలిపారు.