నూతన సంవత్సరం సందర్భంగా ప్రజల ఉత్సాహాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లు మళ్లీ రంగంలోకి దిగారు. హ్యాపీ న్యూఇయర్ శుభాకాంక్షలు, గిఫ్ట్లు, క్రెడిట్ కార్డు ఆఫర్లు, ప్రయాణ రాయితీలు, ఈవెంట్ టికెట్లు అంటూ వాట్సప్, ఎస్ఎంఎస్, సోషల్ మీడియా ద్వారా నకిలీ లింక్లను విస్తృతంగా పంపిస్తున్నారు. ఇలాంటి లింక్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు హెచ్చరిస్తున్నారు. పూర్తి వివరాలు లోకల్ ఎక్స్ప్లెయినర్స్ వీడియోలో చూడండి.