ఛత్తీస్గఢ్లోని కంకేర్ జిల్లాలో ఒక యువకుడు రీల్ కోసం ఎలుగుబంటి ముందుకెళ్లి వీడియో తీయించుకున్నాడు. రీల్ కోసం ఎలుగుబంటి ముందు కూల్డ్రింక్ బాటిల్ ఉంచాడు. అది కూడా ఏమీ చేయకుండా తాగి వెళ్లిపోయింది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అటవీశాఖ అధికారులు ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. అడవి జంతువుల దగ్గరకు వెళ్లడం ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.