TG: ఆదాయ సమీకరణపై అధికారులకు CM రేవంత్ కీలక సూచనలు చేశారు. ఆదాయ సమీకరణ కోసం చేజింగ్ సెల్ను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. AIతో లబ్ధిదారుల జాబితాను డీబీటీకి అనుసంధానం చేయాలని సూచించారు. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసేలా బడ్జెట్ను తయారు చేయాలన్నారు. ఆదాయం పెంపు, నిధుల సమీకరణ విషయంలో నిర్లక్ష్యం వీడాలని చెప్పారు. ఈ సమీక్షలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు జూపల్లి కృష్ణారావు, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎస్ సంజయ్ జాజు పాల్గొన్నారు.