స్వదేశీ డిజిటల్ చెల్లింపుల ప్లాట్ఫామ్ భీమ్ (BHIM) పేమెంట్స్ యాప్, తన 10వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని 'గర్వ్ సే స్వదేశీ' క్యాంపెయిన్ను ప్రారంభించింది. తొలిసారిగా భీమ్ యూపీఐ యాప్ను ఉపయోగించే వారికి 20 రూపాయల క్యాష్బ్యాక్ ఆఫర్ను ప్రకటించింది. రూ.20 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంతో మొదటి లావాదేవీ చేసిన వారికి ఈ ఆఫర్ వర్తిస్తుంది. గ్రామీణ స్థాయిలో డిజిటల్ చెల్లింపులను ప్రోత్సహించడమే దీని లక్ష్యం.