స్టార్ మాలో ప్రసారమవుతున్న బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ప్రస్తుతం ఐదో వారంలో ఉంది. షోపై ఆసక్తి పెంచేందుకు నిర్వాహకులు ఆరుగురు కొత్త కంటెస్టెంట్లను వైల్డ్ కార్డ్ ఎంట్రీల రూపంలో హౌస్లోకి పంపేందుకు సిద్ధమయ్యారు. వీరిలో ఇద్దరు సెన్సేషనల్ స్టార్లు, నలుగురు కొత్త ఫేస్లు ఉన్నారని సమాచారం. దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి, రమ్య మోక్ష, అయేషా జీనత్, నిఖిల్ నాయర్, గౌరవ్ గుప్తా, ప్రభాస్ శ్రీను పేర్లు వైల్డ్ కార్డ్ లిస్టులో ఉన్నాయని టాక్. ఈ కొత్త ఎంట్రీలు షోకి కొత్త ఊపుని తెస్తాయని అంచనా వేస్తున్నారు.