బిహార్ ఎన్నికల లెక్కింపులో మహువా నియోజకవర్గంలో తేజ్ప్రతాప్ యాదవ్ ముందంజలో ఉన్నారు. ఈసారి ఆయన ‘జనశక్తి జనతా దళ్’ పేరుతో కొత్త పార్టీ స్థాపించి బరిలోకి దిగారు. మరోవైపు ఎన్డీయే 50 స్థానాల్లో ముందంజలో ఉండగా, మహాగఠ్బంధన్ 23 స్థానాల్లో ఆధిక్యం సాధిస్తోంది. రాఘోపుర్లో ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ముందంజలో ఉన్నారు. అలీనగర్లో BJP అభ్యర్థి, గాయని మైథిలీ ఠాకూర్ వెనుకంజలో ఉన్నారు. తారాపూర్లో BJP అభ్యర్థి సామ్రాట్ చౌదరీ ముందంజలో ఉన్నారు.