ఆర్జేడీ, కాంగ్రెస్ అస్తవ్యస్త పాలన వల్లే బిహార్ తీవ్రంగా నష్టపోయిందని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రస్తుతం తాము చేపడుతున్న అభివృద్ధిని చూసి ఆ రెండు పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని అన్నారు. సోమవారం బిహార్లోని పూర్ణియా జిల్లాలో పర్యటించిన మోదీ.. జాతీయ మఖానా బోర్డుతో పాటు రూ.36 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. పేదలకు మద్దతివ్వటమే తన ధ్యేయమని మోదీ తెలిపారు.