రెండో దశ పోలింగ్కు బిహార్ సిద్ధం

బిహార్లో రెండో దశ పోలింగ్ మంగళవారం జరగనుంది. 122 అసెంబ్లీ స్థానాల్లో 1,302 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. నీతీశ్ సర్కారులోని పలువురు మంత్రులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. ఈ దశలో దాదాపు 3.70 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయనున్నారు. 45 వేలకుపైగా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా, 40 వేల కేంద్రాలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. పాలక ఎన్డీయే, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటములకు ఈ పోలింగ్ కీలక పరీక్షగా నిలుస్తుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
