TG: పెండింగ్లో ఉన్న మూడు జిల్లాల అధ్యక్షులను బుధవారం
బీజేపీ ప్రకటించింది. కరీంనగర్, వికారాబాద్, మేడ్చల్ జిల్లాల
బీజేపీ అధ్యక్షులుగా సాయిమల్లేశం, యూ.రమేశ్, గిరివర్ధన్ రెడ్డిలను నియమించింది. ఈ మేరకు ముగ్గురి పేర్లను
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్రావు ప్రకటించారు. ఈటల, బండి సంజయ్ మధ్య విబేధాలతో మూడు జిల్లాల అధ్యక్షుల నియామకం పెండింగ్లో ఉండింది. ఇద్దరి మధ్య సయోధ్య కుదరడంతో తాజాగా మూడు జిల్లాలకు అధ్యక్షుల పేర్లను ప్రకటించినట్లు సమచాారం.