ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్

0చూసినవారు
ఎకరాకు రూ.30వేలు ఇవ్వాలని బీజేపీ డిమాండ్
తుఫాను వల్ల పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30వేల నష్టపరిహారం అందించాలని బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్ డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలంలో శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు మండల బీజేపీ అధ్యక్షుడు బత్తిని నరేష్ గౌడ్  బీజేపీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టి, తహసీల్దార్ అనుపమ రావుకు వినతిపత్రం అందజేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం పంట నష్టాన్ని పట్టించుకోవడం లేదని, గతంలో సీఎం ప్రకటించిన పరిహారం కూడా అందలేదని ఆయన ఆరోపించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you