అస్సాంలో రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్ఈడీఏ కూటమి వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ సర్వే అంచనా వేసింది. 126 స్థానాలున్న అసెంబ్లీలో మెజార్టీకి 64 అవసరం కాగా, బీజేపీకి 68-72, ఏజీపీకి 7-10, బీపీఎఫ్కు 8-9 స్థానాలు వస్తాయని, తద్వారా ఎన్ఈడీఏ 90 స్థానాలకు చేరుకుంటుందని సర్వే పేర్కొంది. బీజేపీ 38.6%, కాంగ్రెస్ 36.5% ఓట్లు పొందే అవకాశం ఉంది. ముఖ్యమంత్రి హిమంత్ బిశ్వ శర్మ నాయకత్వానికి 45% మద్దతు లభిస్తుండగా, గౌరవ్ గొగాయ్కు 35% మద్దతు ఉంది. అప్పర్, మధ్య, లోయర్ అస్సాంలోనూ ఎన్డీఏ ఆధిపత్యం కొనసాగే అవకాశం ఉంది.