బీజేపీ ఎంపీ లోక్సభ సభ్యుడు గణేష్ సింగ్ క్రేన్ డ్రైవర్పై చేయి చేసుకున్నాడు. మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలో ఈ సంఘటన చోటుచేసుకుంది. బీజేపీ ఎంపీ చేసిన చర్య ఇప్పుడు దేశవ్యాప్తంగా విమర్శలకు దారితీసింది. సత్నా లోక్సభ సభ్యుడు గణేష్ సింగ్ విగ్రహానికి దండ వేసేందుకు క్రేన్పైకి ఎక్కిన సమయంలో, క్రేన్ కొద్దిగా కదలడంతో ఆగ్రహానికి గురై, పక్కనే ఉన్న మున్సిపల్ కార్మికుడిపై చేయి చేసుకున్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.