TG:
బీజేపీ జాతీయ అధ్యక్షులు జేపీ నడ్డా జూన్ 28న రాష్ట్ర పర్యటనకు వస్తున్నారు. ఆయన శంషాబాద్ విమానాశ్రయం చేరుకుని, రంగారెడ్డి జిల్లా కార్యాలయం నుండి 9 జిల్లాల నూతన పార్టీ కార్యాలయాలను వర్చువల్గా ప్రారంభిస్తారు. సాయంత్రం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో జీహెచ్ఎంసీ పరిధిలోని బూత్ అధ్యక్షులతో భేటీ అవుతారు. జూన్ 29న
విద్యార్థులు, కార్యకర్తలు, ఆదివాసీ, గిరిజన ప్రతినిధులతో సమావేశమవుతారు. వరంగల్లో బూత్ ప్రెసిడెంట్స్ సమావేశంలో పాల్గొంటారు. జూన్ 30న ఘట్కేసర్లో రాష్ట్ర కార్యవర్గ, ఆఫీస్ బేరర్స్ సమావేశంలో ప్రసంగించి ఢిల్లీకి తిరుగుపయనమవుతారు.