బిహార్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఈ నెల 14న విడుదల కానున్నాయి. చాలావరకు ఎగ్జిట్ పోల్స్ ఎన్డీయే కూటమికే విజయావకాశాలున్నాయని అంచనా వేయడంతో, బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఫలితాల రోజు సంబరాల కోసం పట్నాలో 501 కిలోల లడ్డూలను ఆర్డర్ చేసినట్లు సమాచారం. ఒక బీజేపీ నేత మాట్లాడుతూ, 'ఫలితాల రోజు మేమంతా హోలీ, దసరా, దీపావళి, ఈద్ పండగలు చేసుకుంటాం. ఎందుకంటే.. ఓటర్లు ఎన్డీయే కూటమి అభివృద్ధికి జైకొట్టారు' అని తెలిపారు.