ఝార్ఖండ్లోని చాయ్బాసాలో ఐదుగురు తలసేమియా బాధిత చిన్నారులకు హెచ్ఐవీ సోకడం తీవ్ర కలకలం రేపింది. స్థానిక బ్లడ్ బ్యాంక్ ద్వారా రక్తం ఎక్కించుకున్న తర్వాత ఏడేళ్ల బాలుడికి హెచ్ఐవీ సోకిందని కుటుంబం ఫిర్యాదు చేసింది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేయగా, దర్యాప్తులో మరో నాలుగు కేసులు బయటపడ్డాయి. డాక్టర్ దినేశ్ కుమార్ నేతృత్వంలోని బృందం బ్లడ్బ్యాంక్ తనిఖీలో పలు లోపాలు గుర్తించింది.