బాలీవుడ్ ప్రముఖ నటుడు పంకజ్ త్రిపాఠి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి హేమ్వంతి దేవి (89) అనారోగ్యం కారణంగా రెండు రోజుల కిందట మరణించారు. బీహార్లోని ఆయన స్వస్థలం గోపాల్గంజ్లో శనివారం అంత్యక్రియలు పూర్తయినట్లు నటుడి టీమ్ తాజాగా ప్రకటించింది. త్రిపాఠి తండ్రి బెనారస్ తివారీ (99) రెండేళ్ల క్రితం చనిపోయారు. 'మీర్జాపూర్' వంటి వెబ్ సిరీస్ల ద్వారా పంకజ్ త్రిపాఠి తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యారు.