
ఛత్తీస్గఢ్లో 208 మంది మావోయిస్టుల లొంగుబాటు
ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని 208 మంది మావోయిస్టులు సొంతగా ప్రభుత్వం ఎదుట లొంగిపోయారు. వీరిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. వారి వద్ద ఉన్న 153 ఆయుధాలను అప్పగించారు. వీటిలో 19 ఏకే-47 రైఫిళ్లు, 17 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్లు, 1 ఇన్సాస్ ఎల్ఎంజీ, 36 .303 రైఫిళ్లు, 11 బీజీఎల్, 4 కార్బైన్లు, 41 బోర్ షాట్గన్లు, పలు పిస్తోళ్లు ఉన్నాయి.




