రాజస్థాన్లోని బార్మర్ జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఝుంఝునుకు చెందిన అంగన్వాడీ సూపర్వైజర్ ముఖేష్ కుమారి (37) పదేళ్ల క్రితం భర్త నుంచి విడిపోయింది. టీచర్ మనారామ్తో ఆమెకు ఫేస్బుక్లో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఈ నెల 10న 600 కిలోమీటర్లు ఆమె కారు డ్రైవ్ చేసుకుని ప్రియుడి వద్దకు వెళ్లింది. పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేయడంతో అతడు ఆమెను చంపేశాడు. కారు డ్రైవింగ్ సీటులో మృతదేహాన్ని ఉంచి ఇంటికెళ్లి నిద్రపోయాడు. పోలీసుల విచారణలో టీచర్ దొరికిపోయాడు.