భారత్, ఇండోనేషియా మధ్య బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి కొనుగోలుకు సంబంధించి ప్రధాన రక్షణ ఒప్పందాలు పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. రష్యా నుంచి తుది ఆమోదం కోసం ఎదురుచూస్తున్నట్టు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. ఈ ఒప్పందం కుదిరితే, భారత్ అతిపెద్ద రక్షణ డీల్ను పూర్తి చేసినట్లు అవుతుంది. గతంలో ఫిలిప్పీన్స్తో భారత్ 375 మిలియన్ డాలర్ల బ్రహ్మోస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఇక బ్రహ్మోస్ క్షిపణిని DRDO, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.