TG: రాష్ట్రంలోని ప్రభుత్వ ఇంటర్ కాలేజీ విద్యార్థులకు రేవంత్ సర్కార్ బ్రేక్ఫాస్ట్ స్కీమ్ అమలు చేయనుంది దోశ, పూరీ, ఇడ్లీ, మిల్లెట్, బోండా వంటి వెరైటీలు పెట్టాలని నిర్ణయించారు. వయసుకు తగిన పోషకాలు అందేలా ఎంపిక చేశారు. దీంతో 1.92 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరనుంది. మధ్యాహ్న భోజనం, బ్రేక్ఫాస్ట్కు ఏటా రూ.180 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేయనుంది. జూన్ 12న సీఎం రేవంత్ చేతుల మీదుగా ఈ పథకం ప్రారంభించనున్నారు.