BREAKING: కోర్టులో అల్లు అర్జున్కు ఊరట

సినీనటుడు అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టులో ఊరట లభించింది. రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. 'పుష్ప2' ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ మధ్యంతర బెయిల్పై బయట ఉన్నారు. దీంతో కోర్టులో దాఖలైన రెగ్యూలర్ బెయిల్ పిటిషన్పై ఇటీవల విచారణ జరిపిన కోర్టు ఇవాళ తీర్పు చెప్పింది.
