బంగారం, వెండి ధరలు బుధవారం భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,950 పెరిగి రూ.1,38,700కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధరపై రూ.2,130 పెరిగి రూ.1,51,310 పలుకుతోంది. కేజీ వెండిపై ఏకంగా రూ.5,000 పెరగడంతో రూ.2,70,000 వద్ద ధర కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.