బంగారం ధరలు మంగళవారం భారీగా పెరిగాయి. రూ.లక్ష దాటి ఆల్ టైం రికార్డుకు చేరాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.1,250 పెరిగి రూ.1,01,100కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ.1,360 పెరిగి రూ.1,10,290 పలుకుతోంది. కేజీ వెండి ధర రూ.1,40,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లో ఇవే ధరలు ఉండనున్నాయి.