యూపీలోని వారణాసిలో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. వివాహ వేదిక వద్ద వరుడి తండ్రి ₹25,000 కోసం బహిరంగంగా వధువు తండ్రిని అవమానించాడు. దీంతో మనస్థాపం చెందిన వధువు చాందిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. ఆచారాలన్నీ పూర్తయి, తాళి కట్టే సమయంలో ఈ ఘటన జరగడంతో పెళ్లి ఆగిపోయింది. వెంటనే వధువు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారు రంగంలోకి దిగారు. దురాశకు పాల్పడిన వరుడు రోహిత్ జైస్వాల్ను అరెస్ట్ చేశారు.