కరీంనగర్ జిల్లాలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. వ్యాపారంలో నష్టాలు, రూ.1.50 కోట్ల అప్పుల బాధతో మామిడి నరేశ్ తన అన్న వెంకటేశ్ పేరుపై రూ.4.14 కోట్ల బీమా చేయించి, అతన్ని హత్య చేశాడు. ఈ హత్యలో సహకరించిన రాకేశ్, ప్రదీప్లకు డబ్బులు ఇస్తానని నరేశ్ చెప్పినట్లు సమాచారం. బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ప్రధాన నిందితుడు మామిడి నరేశ్తో పాటు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు.