TG: పదేళ్లపాటు ఇరిగేషన్శాఖను బీఆర్ఎస్ నాశనం చేసిందని మంత్రి ఉత్తమ్ కుమార్ విమర్శించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. 'BRS ఏది ముట్టుకుంటే అది నాశనం. దోచుకోడానికే ప్రాజెక్టులు కట్టారు. రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేస్తే దాంట్లో కాళేశ్వరం తప్ప ఏం లేదు. కన్నెపల్లి పంపు హౌస్ ఆన్ చేయాలని అడుగుతున్నారు. ప్రాజెక్టులు సరిగ్గా కట్టి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదు' అని మండిపడ్డారు.