బీఆర్ఎస్ పార్టీపై పీజేఆర్ కూతురు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఆమె మీడియాతో మాట్లాడారు. BRS సెంటిమెంటు రాజకీయం చేస్తోందని విమర్శించారు. మాగంటి సునీత ఏడుపుని నమ్ముకుని ఆ పార్టీ ఉప ఎన్నికకు వెళ్తోందని అన్నారు. ఈ ఎన్నికలో సునీతను బలిపశువును చేసి బీఆర్ఎస్ గెలవాలని చూస్తోందని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయం సునీత త్వరగా తెలుసుకుంటే మంచిదని అన్నారు.