డెహ్రాడూన్లో త్రిపురలో ఎంబీఏ విద్యార్థిని ఏంజెల్ చక్మా దారుణ హత్యను కేటీఆర్ ఖండించారు. ఈ ఘటన పట్ల ఆయన తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వివక్ష, అధికార దుర్వినియోగం కలిస్తే ఎంతటి ఘోరమైన పరిణామాలు ఎదురవుతాయో ఈ సంఘటన గుర్తు చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలు కేవలం విడిగా జరిగిన సంఘటనలు కావని, ద్వేషాన్ని, వివక్షను సహించడం వల్ల కలిగే ముప్పుకు ఇవి ఒక హెచ్చరిక అని ఆయన పేర్కొన్నారు.